రామదండులా కదిలి రండి.. యువతకు బండి సంజయ్ కీలక పిలుపు

by Disha Web Desk 19 |
రామదండులా కదిలి రండి.. యువతకు బండి సంజయ్ కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 14న కరీంగనర్ లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. దేశం కోసం.. ధర్మం కోసం ఈ హిందూ ఏక్తా యాత్రకు తరలిరావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొని హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్న కుహనా లౌకిక వాదులకు బుద్ధి చెప్పాలన్నారు. రామదండులా కదిలిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర హిందువుల ఐక్యతను చాటి చెబుతుందని గుర్తు చేశారు. కాగా లక్షలాది మంది పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొనేలా కమలనాధులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే లవ్ జిహాద్, మత మార్పిడులు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి



Next Story

Most Viewed